Sunday, April 28, 2024

ట్రైయాంగిల్ లవ్ స్టోరీ… సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సజీవదహనం

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఓ యువతి కాళ్లు, చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన తమిళనాడులోని తాళంపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చెన్నైలోని పెరుంగుడిలో ఓ ఐటి కంపెనీలో నందిని(25) పనిచేస్తుంది. వెట్రి మణిమారన్ అనే యువకుడితో ప్రేమలో పడింది. మణిమారన్ ట్రాన్స్‌జెండర్ అని తెలియగానే అతడికి దూరంగా ఉంటుంది. మరో యువకుడు రాహుల్‌తో ప్రేమాయణం కొనసాగిస్తోంది. రాహుల్‌ను మణిమారన్ ప్రేమిస్తుండడంతో అతడిపై నందిని ఆగ్రహం వ్యక్తం చేసింది. నందిని పుట్టిన రోజు సందర్భంగా ఆమెను చెరువుగట్టుకు తీసుకెళ్లాడు. కాళ్లను గొలుసుతో కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పోలీసులు కేసు నమోదు చేసి వెట్రిమణిమారన్ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News