Friday, May 3, 2024

గంటలో కోటి మొక్కలు

- Advertisement -
- Advertisement -

TRS leaders to hold massive green drive on KCR birthday

 

ఈ నెల 17న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోటి వృక్షార్చన
జన హృదయ నేత, ప్రజాకోటి ప్రియతమ సిఎం కెసిఆర్ పుట్టిన రోజున
సిఎం కెసిఆర్ జన్మదినం ఈ నెల 17 ఉ.10గం.కు ఆకుపచ్చని తెలంగాణ ఆశయ పరిపూర్తికి ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటే కార్యక్రమం మొదలు

హైదరాబాద్: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17వ తేదన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హరిత తెలంగాణను స్వప్నిస్తున్న సిఎం సంకల్పానికి మద్దతుగా చంద్రునికో నూలు పోగు వలే, ఒకే రోజు కోటి మొక్కలను నాటే కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని తీసుకున్నారు ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను మంత్రులు కెటిఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు శనివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ‌యంపి మాలోతు కవిత, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణకు హరితహారం ద్వారా ఆకుపచ్చని రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి ఆశయాలు ప్రతిబించించేలా ప్రతీ ఒక్కరూ ఫిబ్రవరి 17న మూడు మొక్కలు నాటాలను కోరారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఎం.పీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవటమే కెసిఆర్ కు మనం ఇచ్చే పుట్టినరోజు కానుక అన్నారు. కోటి వృక్షార్చన కార్యక్రమం తీసుకున్న ఎంపి సంతోష్ కుమార్ ను ఈ సందర్భంగా కెటిఆర్ అభినందించారు. ప్రతీ గ్రామం యూనిట్ గా సర్పంచ్ నేతృత్వంలో అన్ని చోట్లా ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలని, పంచాయితీ రాజ్, అటవీశాఖలతో సమన్వయం ద్వారా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆకాంక్షించారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటి సంరక్షణ బాధ్యత కూడా ప్రతీ ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. ఆరేళ్ల హరితహారం ఫలితాలు ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్నాయని, ఎంపీ సంతోష్ నేతృత్వంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కూడా పచ్చదనం పెంపులో అన్ని వర్గాలను జాగృతం చేస్తోందని మంత్రులు మహమూద్ అలీ, తలసాని అన్నారు.రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్న ఈ కోటి వృక్షార్చనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎం.పీ సంతోష్ కుమార్ కోరారు. జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రలు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర మంత్రులు, నేతలకు కార్యక్రమం వివరాలు సంతోష్ కుమార్ ఫోన్ ద్వారా తెలిపి సహకారం కోరారు.

సిఎం జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్చనలో మొక్కలు నాటే వారందరికీ ప్రత్యేకంగా గుర్తించాలని, వనమాలి బిరుదును ఇవ్వాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భావిస్తోంది. ఆ రోజు మొక్కలు నాటుతూ దిగిన ఫోటోలను ప్రత్యేక యాప్ లో అప్ లోడ్ చేయాలి. యాప్ కోసం వాట్సప్ నుంచి 9000365000 నెంబర్ కు GIC అని మెసేజ్ చేయాలి. యాప్ లింక్ తో కూడిన మెసేజ్ తిరిగి వస్తుంది. దానిలో మొక్కలు నాటుతూ సెల్ఫీ ఫోటోలను ఎవరికి వారు అప్ లోడ్ చేయాలి. కోటి వృక్షార్చనలో పాల్గొన్నందుకు గుర్తింపుగా ముఖ్యమంత్రి సందేశంతో కూడిన వనమాలి బిరుదు ఈ మెయిల్ లేదా మొబైల్ కు వారం రోజుల్లో అందరికి చేరుతుందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు కరుణాకర్ రెడ్డి, రాఘవ తెలిపారు.

 

వనమాలి బిరుదు ప్రదానం
సిఎం జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్చనలో మొక్కలు నాటే వారందరికీ ప్రత్యేకంగా గుర్తించాలని, వనమాలి బిరుదును ఇవ్వాలని గ్రీన్ ఇండి యా ఛాలెంజ్ భావిస్తోంది. ఆ రోజు మొక్కలు నా టుతూ దిగిన ఫోటోలను ప్రత్యేక యాప్‌లో అప్ లో డ్ చేయాలని సూచించింది. యాప్ కోసం వాట్సప్ నుంచి 9000365000 నెంబర్‌కు జిఐసి అని మెసేజ్ చేయాలి. యాప్ లింక్ తో కూడిన మెసేజ్ తిరిగి వస్తుంది. దానిలో మొక్కలు నాటు తూ సెల్ఫీ ఫోటోలను ఎవరికి వారు అప్‌లోడ్ చే యాలి. కోటి వృక్షార్చనలో పాల్గొన్నందుకు గుర్తింపుగా ముఖ్యమంత్రి సందేశంతో కూడిన వనమాలి బిరుదు ఈ మెయిల్ లేదా మొబైల్‌కు వారం రోజు ల్లో ఎవరికివారికి చేరుతుందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు కరుణాకర్ రెడ్డి, రాఘవ తెలిపారు.

TRS leaders to hold massive green drive on KCR’s birthday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News