Saturday, April 27, 2024

పసుపు బోర్డు కోసం టిఆర్ఎస్ ఎంపిల ఆందోళన

- Advertisement -
- Advertisement -

TRS MPs strike for turmeric board in Parliament

 

ఢిల్లీ: పసుపు బోర్డు కోసం లోక్‌సభలో టిఆర్‌ఎస్ ఎంపిలు ఆందోళన చేపట్టారు. పసుపు బోర్డుకు బదులుగా సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేశామని కేంద్రం తెలిపింది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయలేమని కేంద్రం స్పష్టం చేసింది. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బిజెపి హామీ ఇచ్చి మోసం చేసిందని టిఆర్‌ఎస్ ఎంపిలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి సమాధానంపై టిఆర్‌ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.

రాజా బహదూర్ వెంకట్ రామ్‌రెడ్డి పేరిట ప్రత్యేక స్టాంపు విడుదల చేయాలని రాజ్యసభలో మోడీ ప్రభుత్వాన్ని టిఆర్‌ఎస్ ఎంపి సురేష్ రెడ్డి కోరారు. వెంకట్ రామ్‌రెడ్డి 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన సేవలకు గుర్తింపునివ్వాలని కోరారు. బేటీ బచావో… బేటీ పడావో పథకానికి రాజా బహదూర్ వెంకట్ రామిరెడ్డి 85 ఏళ్ల క్రితమే అంకురార్పణ చేశారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News