Monday, April 29, 2024

కూలీలకు కనీస వేతనం పెంచిన ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

TS Govt Raised Minimum wages for day laborers

హైదరాబాద్: కూలీలకు కనీస వేతనం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కూలీలకు రోజువారీ కనీస వేతనం రూ.300 నుంచి రూ.390 పెంచింది. కన్సాలిడేటెడ్ పే వర్కర్ల వేతనం రూ. 8వేల నుంచి రూ.10,400లకు పెంచారు. పార్ట్ టైం వర్కర్ల వేతనం నెలకు రూ.4 వేల నుంచి రూ. 5,200లకు పెంచుతూ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. పెంచిన క‌నీస వేత‌నం ఈ ఏడాది జూన్ నుంచి అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ప్రభుత్వం ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News