Saturday, May 11, 2024

నేటి నుంచి బిసిలకు రూ.లక్ష ఆర్థికసాయం పంపిణీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిసి కులవృత్తుల వారికి ఆర్థికసాయం పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈరోజు(శనివారం) నుంచి బిసి కులవృత్తుల వారికి రూ.లక్ష ఆర్థికసాయం పంపిణీ చేయనుంది. తొలి విడతలో ప్రతి నియోజకవర్గంలో 50 చేతివృత్తుల కుటుంబాలకు ఆర్థికసాయం అందనుంది.

తొలి విడతలో 119 నియోజకవర్గాల్లో 5.950 మందికి ఈ రూ.లక్ష ఆర్థికసాయం పొందనున్నారు. ఇప్పటికే జిల్లాలకు పథకం లబ్దిదారుల జాబితా చేరింది. ఈ ఆర్థిక సాయం కోసం తొలి విడతలో తెలంగాణ సర్కార్ రూ.50 కోట్ల నుంచి రూ.60కోట్లు ఖర్చు చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News