శుక్రవారం నుంచి గురుకుల డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు
ఏప్రిల్ 25వ తేదీన ప్రవేశ పరీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ గరుకుల డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ గురుకులం అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్(టిజియుజిసిఇటి) ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బిఎ, బి.కాం, బిబిఎ, బిఎస్సి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ మేరకు గురుకులాల కార్యదర్శి, టిజియుజిసిఇటి కన్వీనర్ ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. టిజియుజిసిఇటికి అర్హులైన విద్యార్థులు ఈ నెల 5వ తేదీ(శుక్రవారం) నుంచి మార్చి 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 40 శాతం మార్కులతో ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణులైన వారితో పాటు ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం www.tswreis.in, www.tgtwgurukulam.telangana.gov.in వెబ్సైట్లు చూడాలని తెలిపారు.
TS Gurukul Degree Entrance Test on April 25th