- Advertisement -
హైదరాబాద్ః నగరంలో హెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా డిసెంబరు 1న జరిగే పోలింగ్ నాడు రాష్ట్ర హైకోర్టు సెలవు ప్రకటించింది. ప్రతి ఒక్కరూ విలువైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈసందర్భంగా పోలింగ్ రోజున హైకోర్టు, సికింద్రాబాద్లోని తెలంగాణ జ్యూడియషియరీ అకాడమీ, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైకోర్టు మీడియేషన్ అండ్ అర్బిట్రేషన్సెంటర్, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, హైదరాబాద్లోని అన్ని ట్రిబ్యునల్స్కు సెలవు ప్రకటించినట్టు హైకోర్టు రిజిస్ట్రార్జనరల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
TS High Court holiday on December 1
- Advertisement -