Monday, April 29, 2024

నేటితో ముగియనున్న గ్రూప్ 3 దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గ్రూప్ 3 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు గురువారం(ఫిబ్రవరి 23)తో ముగియనుంది. ఈ ఉద్యోగాలకు బుధవారం నాటి ఐదు లక్షలకు చేరువలో దరఖాస్తులు వచ్చాయి. గురువారం నాటికి దరఖాస్తుల సంఖ్య మరింత పెరగనుంది. 1,363 పోస్టులతో గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల కాగా, ఇటీవల మరో 12 పోస్టులు పెరిగాయి. బిసి గురుకుల సొసైటీ పరిధిలో అదనంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పెంచారు. కొత్తగా చేరిన పోస్టులతో గ్రూప్ 3లో పోస్టుల సంఖ్య 1,375కి చేరింది. గ్రూప్ 3 పోస్టులకు జనవరి 24 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, ఈ నెల 23తో దరఖాస్తు గడువు ముగియనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News