Monday, April 29, 2024

సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 15-29 మధ్య రానూపోనూ టికెట్లు బుక్ చేసుకుంటే డిస్కౌంట్ లభించనుంది. తిరుగు ప్రయాణంపై 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది ఆర్టీసీ. ఈ నెల 30 లోగా రిజర్వేషన్ చేసుకుంటేనే రాయితీ సౌకర్యం ఉంటుందని ఆర్టీసీ వెల్లడించింది. పండగలు వచ్చాయంటే నగరాల్లో నివసిస్తున్న ప్రజలు తమ తమ ఊళ్లకు పయనమవుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News