Monday, April 29, 2024

వరంగల్‌లో మైనర్ పై అన్నదమ్ముల అఘాయిత్యం…

- Advertisement -
- Advertisement -

 

వరంగల్‌లో మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు సోదరులు అరెస్టు అయ్యారు. మైనర్ బాలికపై సోదరులిద్దరూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి రావడంతో వరంగల్‌లోని మిల్స్ కాలనీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బ్రతుకు దెరువు కోసం ఇద్దరు కుమారులతో కలిసి దంపతులు వరంగల్ కు వచ్చారు. వెంకట్రమా జంఓన్ సమీపంలోని బంధువుల ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వారి పెద్ద కూతురు 10వ తరగతి చదువుతుంది. కాగా దయానంద్ కాలనీకి చెందిన నిందితులు అలీకి అజ్మత్ (27),అక్బర్ అలీ ( 22) ఏళ్ల వయస్సు వీరు మైనారిటీ వర్గానికి చెందిన వారు.

వీరిద్దరు ఆ బాలిక పై ఒకరికి తెలియకుండా మరొకరు పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టారని అధికారులు వెల్లడించారు. బాలికకు ఇన్ స్టాగ్రాంలో అసభ్యకరమైన మేసేజ్ లు పోస్టులు చేయడంతో తండ్రి చూసి నిలదీయడంతో బాలిక అన్నదమ్ములు అత్యచారానికి పాల్పడ్డారని తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు , భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. నిందితుడి నివాసం పై దాడి చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే విచారణ చేపట్టి గురువారం మధ్యాహ్నం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News