Saturday, May 11, 2024

పెళ్లి బస్సు బోల్తా: ఇద్దరు మృతి…. 41 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

Two dead as marriage party's bus falls in gorge

 

బెంగళూరు: కర్నాటక రాష్ట్రం తుమకూరు ప్రాంతం మెకరహట్టిలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన గుంతలోకి దూసుకపోవడంతో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తుమకూరు, సిరా ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు సిద్ధార్థ్ మెడికల్ కాలేజీకి ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఓ పది మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. సిఐ రవికుమార్, పోలీస్ అధికారి హనుమంతప్ప ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మృతులు కిట్టప్ప(46), అతడి భార్య భాగ్యమ్మ(40)గా గుర్తించారు. మృతులు  కోరాటగేర్ తాలూకలోని శభోనహల్లి గొల్లార్ హట్టి గ్రామస్థులుగా గుర్తించారు. అతివేగంగా బస్సు ఉండడంతో మూలములుపు వద్ద బోల్తాపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News