Monday, April 29, 2024

ఢిల్లీలో కూలిన భవనం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ ప్రాంతం కబీర్‌నగర్‌లో గురువారం తెల్లవారుజామున పాత భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రెస్య్కూ సిబ్బంది, అధికారులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు కూలీలను పోలీసులు బయటకు తీసుకరాగా ఇద్దరు మృతి చెందారు. మరొకరు చికిత్స పొందుతున్నారు. కూలీలు గ్రౌండ్ ఫ్లోర్‌లో జీన్స్ కటింగ్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భవనం యజమాని షాహిద్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి షాహిద్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News