Monday, April 29, 2024

విద్యుత్ బకాయిల వివాదం… ఆ రాష్ట్రాలే పరిష్కరించుకోవాలి

- Advertisement -
- Advertisement -

విద్యుత్ బకాయిల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచన

No free power for Central power reforms

మనతెలంగాణ/హైదరాబాద్:  విద్యుత్ బకాయిల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని కేంద్రం సూచించింది. విద్యుత్ బకాయిల చెల్లింపు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్నవివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున ఆ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు కేంద్ర ఇంధనశాఖ మంత్రి ఆర్‌కె సింగ్ వెల్లడించారు. రాజ్యసభ ఎంపి విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ తెలంగాణ 6,111 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని, కేంద్ర జోక్యం చేసుకుని బకాయిలు చెల్లించేలా కృషి చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ ఏడాది జూలై 14న తమకు లేఖ రాసినట్లు మంత్రి పేర్కొన్నారు.

విద్యుత్ సరఫరా ఒప్పందం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా రాష్ట్ర విభజన తర్వాత ఉభయ రాష్ట్రాలు ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. మొదట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పొందిన విద్యుత్‌కు తెలంగాణ చెల్లింపులు చేశామని తెలిపింది. విద్యుత్ చార్జీలకు సంబంధించి తెలంగాణ బకాయిపడ్డ సొమ్ములో అసలుపై ఎలాంటి వివాదం లేదు. అసలుపై విధించిన వడ్డీ విషయంలోనే రెండు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ వడ్డీ చెల్లింపుపై పవర్ పర్చేజ్ ఒప్పందంలోని షరతులకు లోబడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సామరస్యంగా రాజీ కుదుర్చోకోవాలని మంత్రి వెల్లడించారు. విద్యుత్ బకాయిల చెల్లింపులో తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంశం కోర్టు విచారణ పరిధిలో ఉన్నందున ఉభయ రాష్ట్రాలు వివాదాన్ని పరిష్కరించుకోవడమే ఉత్తమ మార్గమని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News