Monday, April 29, 2024

నక్సల్స్ మందుపాతర పేలి కానిస్టేబుల్‌కు గాయాలు

- Advertisement -
- Advertisement -

Constable injured in IED blast by Naxals in Chhattisgarh

 

రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్ లోని దంతేవాడ జిల్లాలో మంగళవారం నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి డిస్ట్రిక్టు రిజర్వు గార్డు అసిస్టెంట్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. రాయ్‌పూర్‌కు 400 కిమీ దూరంలో బొడిలి స్థావరం సమీపాన భద్రతా బలగాలు, జవాన్లు సంయుక్తంగా రోడ్డు భద్రతా చర్యలు తీసుకుంటుండగా మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని దంతేవాడ పోలీస్ సూపరింటెండెంట్ అభిషేక్ పల్లవ చెప్పారు. అలాగే మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో భద్రతా బలగాలను లక్షంగా చేసుకుని మరో మందుపాతర పేల్చినా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టి నక్సల్స్ అమర్చిన మరో నాలుగు మందుపాతరలను నిర్వీర్యం చేయగలిగారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News