- Advertisement -
జమ్ము: జమ్మూకాశ్మీర్ రాజౌరీ జిల్లాలో భద్రతాదళాలు శుక్రవారం ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు థానామండీ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నారన్న సమాచారంతో ఆపరేషన్ చేపట్టామని ఎడిజిపి (జమ్మూజోన్) ముకేశ్సింగ్ తెలిపారు. నెల రోజులుగా ఉగ్రవాదుల కదలికలపై డిజిటల్ నిఘా ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు.
- Advertisement -