Monday, April 29, 2024

లారీ- బైక్ ఢీ: ఇద్దరు యువకులు మృతి

- Advertisement -
- Advertisement -

చేగుంట : చేగుంట మండలం చిన్నశివునూర్ గ్రామ శివారులోని బైపాస్ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని జాతీయ రహదారి44 బైపాస్ లో ఎదురుగా రాంగు రూటు లో వస్తున్న కంటైనర్ లారీ ఎదురుగా వెళుతున్న బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులు అక్కడి కక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

చేగుంట నుండి మక్కరాజిపేట వెళ్లే రహదారి సీసీ రోడ్డు నిర్మణం చేస్తున్నందున వాహనాల మల్లింపు చేపట్టారు. వాహనాల మళ్లింపు వల్లే ఎదురు ఎదరుగా వచ్చి ఢీకోట్టుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన యువకులు రామాయంపేట మండలం జాన్సి లింగాపూర్ గ్రామానికి చెందిన కోళ్ల రవితేజ(20), బాలాజీ సింగ్ (35) గా ఎస్ఐ దృవీకరించారు. ప్రమాదం గురువారం రాత్రి అందాజ 11 గంటలకు జరిగిందని తెలిపారు. మృతులను ఎరియా అసుపత్రికి తరలించి రాకుర్ పద్మబాయ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ప్రకాష్ గౌడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News