బెంగళూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ దగ్గర ఇంగ్లాండ్ చెందిన వ్యక్తి రూ.4.6 లక్షలు కొట్టేసిన సంఘటన కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఇంగ్లాండ్కు చెందిన మైఖేల్ అనే వ్యక్తికి బెంగళూరుకు చెందిన మహిళకు మ్యారేజ్ పోర్టల్లో పరిచయమయ్యాడు. దీంతో ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందామని నిర్ణయం తీసుకున్నారు. తాను ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకుంటానని మైఖేల్ ఆమెను నమ్మించాడు. భారీగా ఆభరణాలతో ఢిల్లీ ఎయిర్పోర్టులో ఉన్నానని, బంగారం ఎక్కువగా ఉండడంతో కస్టమ్స్ అధికారులు టాక్స్ చెల్లించాలన్నారని మహిళకు మైఖేల్ ఫోన్ లో తెలిపాడు. తన దగ్గర అంత డబ్బులు లేవని రూ.4.6 లక్షలు చెల్లిస్తే బంగారంతో బెంగళూరు వస్తానని ఆమెతో అతడు నమ్మబలికాడు. వెంటనే ఆమె రూ.4.6 లక్షలు అతడి ఎకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసింది. మరుక్షణమే అతడ తన ఫోన్ను స్విచ్ఛాఫ్ చేయడంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.