లాహోర్ : ప్రస్తుత క్రికెట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన ఆరాధ్య ఆటగాడని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఉమర్గుల్ పేర్కొన్నాడు. ఒకప్పుడూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన అభిమాన బ్యాట్స్మన్గా ఉండేవాడన్నాడు. అయితే సచిన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ స్థానాన్ని కోహ్లి భర్తీ చేశాడన్నాడు. కోహ్లి బ్యాటింగ్ అంటే తనకు చాలా ఇష్టమన్నాడు. ప్రపంచ క్రికెట్కు లభించిన ఆణిముత్యాల్లో కోహ్లి ఒకడన్నాడు. అతనిలా నిలకడగా ఆడడం అందరికి సాధ్యం కాదన్నాడు. ఫార్మా ట్ ఏదైన పరుగుల వరద పారించడం ఒక్క విరాట్కు మాత్రమే సాధ్యమన్నాడు. రానున్న రోజుల్లో క్రికెట్లోని చాలా రికార్డులను అతను బద్దలు కొట్టడం ఖాయమని జోస్య చెప్పాడు. ఇక, ప్రస్తుతం టీమిండియా ప్రపంచంలోనే అత్యంత బలమైన జట్టుగా ఎదిగిందన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ నిలకడైన విజయాలతో భారత జట్టు అగ్రశ్రేణి జట్టుగా కొనసాగుతుందని గుల్ ప్రశంసించాడు.