- Advertisement -
హైదరాబాద్: లాక్ డౌన్ అమలులో ఉందని బయటకు వస్తే చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తి మేసేజ్ పెట్టడంతో యువతి భయపడి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సంఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. లాక్ డౌన్ అమలులో ఉంది… ఇంట్లోనే ఉండాలి… బయటకు రావొద్దు, తాను చెప్పినట్టు బయటకు వచ్చినా? లేక యువతిని బయట చూసినా చంపేస్తానని బెదిరించాడు. గుర్తు తెలియని వ్యక్తి ఎవరు ఎందుకు మేసేజ్ పంపిస్తున్నాడో అర్థం కావడంలేదని యువతి వాపోయింది. దీంతో యువతి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -