Monday, April 29, 2024

భార్యను గొడ్డలితో నరికి… నడి వీధుల్లోకి లాక్కెళ్లాడు….

- Advertisement -
- Advertisement -

Husband killed wife with axe

జైపూర్: దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్యను భర్త గొడ్డలితో నరికి మృతదేహాన్ని వీధుల్లోకి లాక్కెళ్లిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం రామ్‌పూర పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. పింటూ (40) అనే వ్యక్తి పదిహేను సంవత్సరాల క్రితం సీమ(35)ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు అవినాశ్ అనే సంవత్సరం బాబు ఉన్నాడు. పింటూ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోదరుడి ఇంటిలో ఉన్న సీమను తన ఇంటికి పింటూ తీసుకెళ్లాడు. మంగళవారం సాయంత్ర ఇద్దరు మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కోపంతో ఊగిపోయిన పింటూ గొడ్డలి తీసుకొని తన భార్యను నరికాడు. ఆమె మృతదేహాన్ని నడి వీధిలో 80 మీటర్లు లాక్కెళ్లాడు. ఈ ఘటన చూసి ఇరుగుపొరుగు వారు భయంతో వణికిపోయారు. ఘటనా స్థలం నుంచి పారిపోయిన పింటూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు చనిపోయాడు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై గతంలో అత్యాచారం, దాడితో పాటు ఐదు కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News