- Advertisement -
హైదరాబాద్: కరోనా సమయంలో సేవలందించిన ఇఎస్ఐ సిబ్బందికి అభినందనలు అని గవర్నర్ తమిళసై తెలిపారు. సనత్నగర్ ఇఎస్ఐ ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తమిళసై మీడియాతో మాట్లాడారు. 18 లక్షల మంది ఇప్పటి వరకు ఇఎస్ఐ సేవలు పొందారని, కరోనా సమయంలో ఇఎస్ఐ మెడికల్ కాలేజ్ ఎన్నో ఇన్నోవేషన్స్ను ప్రారంభించిందన్నారు. హెల్త్కేర్ వర్కర్స్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడొద్దన్నారు.
- Advertisement -