Sunday, April 28, 2024

శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం

- Advertisement -
- Advertisement -

తిరుమల: శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. శనివారం ఉదయం 9 నుంచి స్వర్ణరథంపై శ్రీదేవి సమేతుడైన మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని ఆలయ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5వరకు వాహన మండపంలో భక్తులకు మలయప్పస్వామి దర్శనం ఇవ్వనున్నారు. ఆదివారం ఉదయం 4 గంటలకు ద్వాదశి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వీఐపీల తాకిడి పెరిగింది. స్వామివారి దర్శనం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు. క్యూ కడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News