పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తోన్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబయ్లో జరుగుతోంది. అక్కడ ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. విజయ్ సరసన బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటివరకు చిత్ర బృందం 40 రోజుల షూటింగ్ పూర్తి చేయగా… ఇందులో రెండు భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. విజయ్ దేవరకొండ, రమ్యకృష్ణ, అనన్య పాండే, రోణిత్ రాయ్, అలీ తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలు తీశారు. పాన్ ఇండియా ఫిల్మ్గా రూపొందుతున్న ఈ సినిమాను బడ్జెట్ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా భారీ స్థాయిలో పూరి కనెక్ట్, ధర్మా ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ యాక్షన్ ఫిల్మ్ను పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ః విష్ణు శర్మ, ఎడిటింగ్ః జునైద్ సిద్ధిఖీ, ఆర్ట్ః జానీ షేక్ బాషా, స్టంట్స్ః కెచ్చా.