వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా బుచ్చి బాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ చిత్రంలోని మొదటి పాటను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా ఖవ్వాలీ తరహాలో సాగే ‘నీ కన్ను నీలి సముద్రం’ అనే ఈ పాట స్వల్ప కాలంలో 10 మిలియన్ వ్యూస్ దాటి బాగా పాపులర్ అయిన పాటల్లో ఒకటిగా నిలిచింది. హీరోయిన్ కృతి శెట్టిపై తనకెంత ప్రేమ ఉందో ఈ పాటలో వైష్ణవ్ తేజ్ చెప్పే విధానాన్ని అతి సుందరగా తెలియజేశారు. ఈ పాటకు వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత రెండో పాటను సోమవారం విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ‘ధక్ ధక్ ధక్’ అంటూ సాగే ఈ పాటను సోమవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఒక ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ బ్యానర్తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేయనున్నారు.