Saturday, April 27, 2024

విరాట్ డకౌట్…. టీమిండియా 49/3

- Advertisement -
- Advertisement -

Virat kohli duck out in Eng vs Ind

 

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 31 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 49 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. విరాట్ కోహ్లీ పరుగులేమీ చేయకుండా స్టోక్స్ బౌలింగ్‌లో ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఛటేశ్వరా పుజారా 17 పరుగులు చేసి లీచ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లు రూపంలో ఔటయ్యాడు. శుభ్ మన్ గిల్ డకౌట్‌గా తొలి వికెట్ రూపంలో ఔటైన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(26), అజింక్య రహానే(02) బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులు చేసింది. ఈ సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News