Monday, April 29, 2024

యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది..

- Advertisement -
- Advertisement -

Woman allegedly burnt alive in Visakhapatnam

విశాఖ: ఎపిలోని విశాఖపట్నంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదని ఆగ్రహంతో ఓ ప్రేమోన్మాది యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత అతను కూడా నిప్పంటించుకున్నాడు. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని చికిత్స కోసం ఇద్దరినీ కెజిహెచ్ కు తరలించారు. అయితే, యువతి శరీరం 60శాతం కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడు వరంగల్ కు చెందిన హర్షవర్దన్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు.

Woman allegedly burnt alive in Visakhapatnam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News