Monday, April 29, 2024

పెళ్లికి ప్రియుడు నిరాకరణ.. యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జిల్లాలోని బిబిపేట మండలంలోని తుజాల్ పూర్ గ్రామంలో చోటచేసుకుంది. యువతితో ప్రేమాయణం నడిపిన ఓ వ్యక్తి.. పెళ్లి విషయానికొచ్చేసరికి మొహం చాటేశాడు.

దీంతో మనస్థాపానికి గురైన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానాకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News