Monday, April 29, 2024

బస్సు కండక్టర్ పై మహిళ దాడి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బస్సు కండక్టర్ పై మహిళ దాడి చేసి అనంతరం కాలుతో తన్నిన సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ బస్ డిపో పరిధిలో జరిగింది. హయత్ నగర్ బస్ డిపో 1కు చెందిన కండక్టర్ మీద ఓ మహిళ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ, దుర్భాష లాడుతూ, కొడుతూ, కాలుతో తన్ని దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్సులో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు ఎంత వారించినా సదరు మహిళ పట్టించుకోకుండా కండక్టర్ పై దాడికి పాల్పడింది. అయినా ఒక మహిళ అనే గౌరవంతో సదరు కండక్టర్ సంయమనం పాటించాడు. కండక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News