Monday, April 29, 2024

కూలీల ఆటో బోల్తా.. 15 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: జిల్లా లోని భువనగిరి మండలం బొల్లపల్లి గ్రామం దగ్గర ఆటో బోల్తా పడి 15 మందికి తీవ్ర గాయాలైనాయి. స్థానికులు వెంటనే గాయపడిన15 మందిని అంబులెన్స్ లో భువనగిరి జిల్లా ఏరియా హాస్పిటల్ కి తరలించారు. కూలీలంతా ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల కు చెందిన వారు. బోల్లపల్లి,చినోల్ల వారి బాయి దగ్గర కోలాఫారంలో నివాసముంటున్నట్లుగా తెలిపారు. మూడు రోజుల క్రితం వరి పొలం నాట్ల వెయ్యడానికి గొల్లపల్లి కి వచ్చిన కూలీలు పనికి వెళ్లి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 30 మంది ఉన్నట్లుగా సమాచారం. ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News