Saturday, April 27, 2024

క్రికెట్ అభిమానులకు బిసిసిఐ గుడ్ న్యూస్

- Advertisement -
- Advertisement -

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రపంచ కప్ సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లు చూడాలనుకునే అభిమానులు తమ టికెట్లను గురువారం (నవంబర్ 9) రాత్రి 8 గంటల నుంచి https://tickets.cricketworldcup.com వెబ్ సైట్లో బుక్ చేసుకోవచ్చని బిసిసిఐ తెలిపింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఈ నెల 15న తొలి సెమీఫైనల్, ఆ మర్నాడే కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో రెండో సెమీ ఫైనల్ జరుగుతాయి.

ఇండియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్ కు అర్హత సాధించగా, మరో స్థానం కోసం పాకిస్తాన్, న్యూజీలాండ్, ఆప్ఘనిస్తాన్ హోరాహోరీ పోరాడుతున్నాయి. ఈనెల 12వ తేదీతో లీగ్ మ్యాచ్ లు పూర్తవుతాయి. ఇంగ్లండ్, నెదర్లాండ్స్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు టోర్నమెంటునుంచి ఇప్పటికే వైదొలిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News