Monday, April 29, 2024

దేశాల అధినేతల నుంచి ప్రధానికి శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

World leaders Greetings to the Prime Minister

న్యూఢిల్లీ: 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీకి పలు దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపినవారిలో నేపాల్ ప్రధాని షేర్‌బహదూర్‌దేవుబా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, భూటాన్ ప్రధాని లొటాయ్‌షెరింగ్, శ్రీలంక ప్రధాని మహిందరాజపక్ష ఉన్నారు. వీరందరికీ ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ అభివృద్ధి పథంలో సాగాలంటూ షేర్‌బహదూర్ తన సందేశంలో ఆకాంక్షించారు. కష్ట సమయంలో తమకు అండగా నిలిచిన భారత ప్రభుత్వం, ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నానని లొటాయ్ ట్విట్ చేశారు. భారత్‌తో తమ భాగస్వామ్యం విలువలు, పరస్పర నమ్మకంతో కూడినదంటూ స్కాట్ సందేశమిచ్చారు. మన రెండు దేశాల బంధం రోజురోజుకూ మరింత బలోపేతమవుతున్నదని రాజపక్ష తన సందేశంలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News