Sunday, April 28, 2024

అయోధ్య నుంచి యోగి

- Advertisement -
- Advertisement -

Yogi likely to contest assembly polls from Ayodhya

అభివృద్ధి, హిందూత్వ నినాదాలతో తిరిగి అధికారం చేపట్టే బిజెపి వ్యూహం

న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అయోధ్య అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దించాలని బిజెపి కోర్ కమిటీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. యుపిలో టికెట్ల కేటాయింపుపై మంగళవారం ఢిల్లీలో బిజెపి కోర్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ కమిటీలో యోగి కూడా సభ్యుడే. యోగి అభ్యర్థిత్వంపై కోర్ కమిటీ చర్చించినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, ఏ అభ్యర్థిని ఎక్కడ నిలపాలన్నదానిపై బిజెపి ఎన్నికల కమిటీదే తుది నిర్ణయమని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ రాష్ట్ర యూనిట్ సిఫారసులను పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.

అయోధ్యలో రామాలయం నిర్మించడానికి సానుకూలంగా 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత బిజెపికి ఆ స్థానం కీలకంగా మారింది. రామాలయం నిర్మాణం కోసం దేశవ్యాప్త రథయాత్ర(ఎల్‌కె అద్వానీ నేతృత్వంలో) చేపట్టిన తర్వాతే బిజెపి బలోపేతమైన విషయం రాజకీయ పరిశీలకులకు తెలిసిందే. 1990ల నుంచి యుపిలో బిజెపి బలమైన పార్టీగా వేళ్లూనుకున్నది. మధ్యలో ఎస్‌పి, బిఎస్‌పిల కూటమి, ఇతర కూటములు అధికారం చేపట్టినా బిజెపికి యుపి వెన్నెముకగా నిలిచింది. హిందూ మతస్థుల్ని ప్రభావితం చేయాలంటే యోగిని అయోధ్య లేదా మథుర నుంచి బరిలోకి దించాలని ఆ రాష్ట్ర నేతలు కోరుతున్నారు. గోరఖ్‌పూర్ నుంచి ఐదుసార్లు ఎంపీగా ఎన్నికైన యోగిని అయోధ్య నుంచి బరిలోకి దించడం ద్వారా హింతూత్వ, అభివృద్ధి నినాదాలతో తిరిగి అధికారం చేపట్టవచ్చునని ఆ వర్గాలు సూచిస్తున్నాయి. గోర్‌ఖ్‌పూర్‌మఠ్‌కు అధిపతిగా పని చేసిన చరిత్ర యోగికి ఉన్నది. మథుర నుంచి బరిలోకి దించాలని రాజ్యసభ సభ్యుడు హర్‌నాథ్‌యాదవ్ బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాకు లేఖ రాశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News