Monday, April 29, 2024

ఓపి జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీతో యార్క్ విశ్వవిద్యాలయం ఒప్పందం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ పి జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీ, కెనడాలోని యార్క్ విశ్వవిద్యాలయం రెండు దేశాల మధ్య విద్యాపరమైన సహకారం, విద్యార్థుల మొబిలిటీకి మద్దతు ఇవ్వడం కోసం అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం చేశాయి. అకడమిక్ ప్రోగ్రామింగ్, పరిశోధన, ఆవిష్కరణ , వ్యవస్థాపక కార్యకలాపాలు, సదస్సులలో వారికి ఉన్న సహకారాన్ని ఈ ఎంఓయు మరింతగా పెంచుతుంది.ఈ భాగస్వామ్యంలో భాగంగా, రెండు విశ్వవిద్యాలయాలు విద్యార్థి, అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాలు, విదేశాలలో స్వల్పకాలిక అధ్యయనం, డ్యూయల్-డిగ్రీ ప్రోగ్రామ్‌లు, సహకార పరిశోధన ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని భావిస్తున్నాయి.

కెనడాలో మూడవ అతిపెద్ద విశ్వవిద్యాలయం యార్క్ యూనివర్సిటీ. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌పై ప్రభావం చూపడంతో పాటుగా ప్రపంచంలోని టాప్ 40లో ర్యాంక్ పొందింది, భారతదేశంతో తమ సంబంధాలను బలోపేతం చేయటంతో పాటుగా ప్రతిభావంతులైన విద్యార్థులు, పరిశోధకులకు పరస్పర ప్రయోజనకరమైన అవకాశాలను సృష్టించే అనేక క్లిష్టమైన కార్యక్రమాలలో పెట్టుబడి పెట్టడం పట్ల యూనివర్సిటీ గర్వంగా ఉంది. దీనిలో భాగంగా ఓ పి జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీతో ఇండియా ఇమ్మర్షన్ ప్రోగ్రామ్‌ కూడా భాగంగా వుంది. కెనడియన్ విద్యార్థులు, భారతదేశంను అర్థం చేసుకోవటం, దాని వృద్ధి కథనం, ప్రపంచంపై భారతదేశం యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

ఈ విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వాములతో కలిసి పని చేస్తోంది. ఇది CA$ 318-మిలియన్ కనెక్టెడ్ మైండ్స్ ఇనిషియేటివ్ వంటి ప్రపంచ-స్థాయి ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనలో అధిక-నాణ్యత ప్రోగ్రామ్‌లు, నాయకత్వాన్ని అందిస్తుంది, ఇది పరిశ్రమలు సమానమైన సాంకేతికతలను త్వరగా మార్కెట్‌లోకి తీసుకురావడానికి తోడ్పడటంతో పాటుగా తరువాతి తరం విద్యార్థులకు శిక్షణనిస్తుంది.

ప్రపంచంలోని అతిపెద్ద వ్యాపార, వినియోగదారుల మార్కెట్‌కు ప్రతిభావంతులైన విద్యార్థులను అన్వేషించేలా భారత దేశ వ్యాప్త వ్యవస్థాపక బూట్ క్యాంప్ కూడా భాగంగా ఉంటుంది. భారతదేశం వంటి ప్రాధాన్యత దేశాలలో ప్రముఖ విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, NGOలతో ప్రపంచ పరిశోధన సహకారాలలో పెట్టుబడి పెట్టే కొత్త ప్రపంచ పరిశోధనా సీడ్ ఫండ్ ప్రారంభించడం కూడా దీనిలో భాగంగా ఉంటుంది. అనేక ప్రతిష్టాత్మకమైన భారతీయ పరిశ్రమలు, సంస్థల వలె, ఈక్విటీ, ఇంక్లూషన్ పరిష్కరించే రంగాలలో బోధన, పరిశోధన, జ్ఞాన సమీకరణకు యార్క్ ప్రాధాన్యతనిస్తోంది. విపత్తు ప్రమాదం, అత్యవసర నిర్వహణ, మానవతా చర్యలు, ఆరోగ్యం, అభివృద్ధి, పర్యావరణం, వాతావరణ మార్పు, ఈక్విటీ, వైవిధ్యం, ఇంక్లూషన్ వంటి అంశాలలో విధాన అభివృద్ధిపై ఇంటర్‌సెక్టోరల్ సహకారాన్ని ప్రోత్సహించడానికి అంకితమైన ఐక్యరాజ్యసమితి CIFAL శిక్షణా కేంద్రాన్ని కలిగి ఉన్న మొదటి కెనడియన్ విశ్వవిద్యాలయం యార్క్, ఇది UNITAR భాగస్వామ్యంతో నీటి సుస్థిరత సంక్షోభాన్ని పరిష్కరించే లక్ష్యంతో రూపాంతరం చెందే కొత్త గ్లోబల్ వాటర్ అకాడమీలో ప్రధాన విద్యా భాగస్వామిగా కూడా నిలిచింది.

యార్క్ విశ్వవిద్యాలయం యొక్క ఎనిమిదవ ప్రెసిడెంట్, వైస్-ఛాన్సలర్ అయిన ప్రొఫెసర్ (డా.) రోండా ఎల్. లెంటన్, ఓ పి జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీ వ్యవస్థాపక వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ (డా.) సి రాజ్ కుమార్, ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా ఉమ్మడి కార్యక్రమాలను ప్రకటించారు. కెనడియన్ విద్యార్థులు భారతదేశాన్ని ఒక దేశంగా, దాని వృద్ధి కథనాన్ని మెరుగ్గా అర్థం చేసుకోవడానికి వీలుగా ఒక ఇండియా ఇమ్మర్షన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడం కూడా వీటిలో ఉన్నాయి.

నేటి ప్రపంచంలో ప్రగతిశీల విశ్వవిద్యాలయాల ప్రాముఖ్యతను ఎత్తిచూపిన, ప్రొఫెసర్(డా) రోండా ఎల్. లెంటన్ మాట్లాడుతూ.. “అంతర్జాతీయ మహమ్మారి నుండి ప్రపంచం కోలుకుంటుండటం , పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణంతో అస్థిరమైన ఆర్థిక వ్యవస్థలు, మన గ్రహం అంతరించిపోయే ప్రమాదాన్ని పెంచే ఉష్ణోగ్రతల నుండి – AI మరియు ఆటోమేషన్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వేగవంతమైన విస్తరణలో నావిగేట్ చేస్తున్నప్పుడు యార్క్ విశ్వవిద్యాలయం, ఓపి జిందాల్ గ్లోబల్ విశ్వవిద్యాలయం వంటి ప్రగతిశీల విశ్వవిద్యాలయాలకు అత్యంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ కొత్త ప్రపంచంలో నాయకత్వం వహించడానికి భారతదేశం, కెనడా సహజ భాగస్వాములు. అంతేకాకుండా, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారతదేశం ఒకటి, భాగస్వామ్యాల క్రింద చిన్న వ్యవస్థాపకత అధ్యయన పర్యటనల కోసం మా విద్యార్థులు ఇక్కడకు రావడం చాలా కీలకమైన పరిణామం” అని అన్నారు.

ప్రొఫెసర్ (డా) సి. రాజ్ కుమార్ మాట్లాడుతూ “విజ్ఞాన మార్పిడి, అవకాశాల ప్రపంచ రంగాన్ని సృష్టించడానికి భారతదేశం యొక్క అన్వేషణలో, కెనడా ఒక ముఖ్యమైన భాగస్వామి. కెనడా యొక్క ప్రముఖ విశ్వవిద్యాలయం యార్క్ విశ్వవిద్యాలయంతో సహకారం మా సంస్థాగత ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. కెనడియన్ బ్యూరో ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఇటీవలి డాటా ప్రకారం కెనడా అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు 34% మంది భారతదేశం నుండి వచ్చారు. సమీప భవిష్యత్తులో భారత్‌ను సందర్శించే కెనడియన్ విద్యార్థుల సంఖ్య వృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా, ఈ సంబంధం మన విశ్వవిద్యాలయాల మధ్య అనుబంధాన్ని పెంపొందించడమే కాకుండా భారతదేశం, కెనడా మధ్య దీర్ఘకాలిక విద్యా సంబంధాన్ని బలపరుస్తుంది” అని అన్నారు.

ఆయనే మాట్లాడుతూ: “విద్యా రంగంలో, భారతదేశం, కెనడా సన్నిహిత, దీర్ఘకాల సంబంధాన్ని కలిగి ఉన్నాయి. కెనడా-భారత్ ద్వైపాక్షిక సంబంధాలలో ఉన్నత విద్య, పరిశోధన భాగస్వామ్యం కీలకమైన భాగం. అనేక దౌత్య, సాంస్కృతిక సంఘాలను పంచుకునే రెండు దేశాలకు సహజంగానే, విద్యార్థుల రాకపోకలు, పరిశోధన భాగస్వామ్యాలు, విద్యా మార్పిడి వంటి రంగాలు ఉత్పాదక సహకారాన్ని నిరంతరం పెంచుతాయి. 2009లో మా కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుండి, భారతదేశపు మొట్టమొదటి ‘గ్లోబల్ యూనివర్శిటీ’ని నిర్మించడంపై మేము దృష్టి సారించాము. అంతర్జాతీయ నేపధ్యంలో ప్రపంచ అభ్యాస అనుభవాన్ని నిర్ధారించడం ద్వారా ఉన్నత విద్య యొక్క ప్రతి అంశంలో అంతర్జాతీయతను పెంపొందించడం ద్వారా మేము ఈ లక్ష్యం పట్ల మా నిబద్ధతను నిరూపించుకున్నాము. భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నప్పుడు, ఆవిష్కరణలు, సాంకేతికత, వ్యవస్థాపకత చాలా కీలకం కానున్నాయి. యార్క్, ఇతర భారతీయ విశ్వవిద్యాలయాలు ఆవిష్కరణ, సాంకేతికత, వ్యవస్థాపకతను ప్రోత్సహించడంలో ముందంజలో ఉంటాయి” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News