Monday, April 29, 2024

రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

 

అమరావతి: రైలు కిందపడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పొందూరు-సిగడం రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కె. ఉపేందర్ అనే యువకుడు రైల్వే కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు పట్టాలపై మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడు పొందూరుకు చెందిన యువకుడిగా గుర్తించారు. మృతుడు ఉపేందర్ స్థానిక ప్రభుత్వ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. రైల్వే పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శ్రీకాకుళం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

 

Young Man Commit Suicide in Andhra Pradesh State
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News