Monday, April 29, 2024

అర్ధ రాత్రి బాలికపై కిరోసిన్ పోసి… నిప్పంటించాడు…

- Advertisement -
- Advertisement -

Youth sets girl ablaze in Uttar Pradesh

లక్నో: అర్ధ రాత్రి నిద్రిస్తున్న 16 ఏళ్ల బాలికపై కిరోసిన్ పోసి తగలబెట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బాలియ జిల్లాలో జరిగింది. 60 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో యువతి చికిత్స పొందుతుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 16 ఏళ్ల అమ్మాయి తన తండ్రిలో కలిసి డాబాపై పడుకుంది. పక్కింటి యువకుడు (22) డాబా పైకి వచ్చి గాఢ నిద్రలో ఉన్న ఆమెపై కిరోసిన్ పోసి తగలబెట్టాడు. ఆమె కేకలు వేయడంతో పక్కనే ఉన్న తండ్రి లేచి మంటలను ఆర్పేశాడు. అప్పటికే నిందితుడు ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. 60 శాతం గాయాలతో ఐసియులో ఆమె చికిత్స తీసుకుంటుంది. నిందితుడు ఢిల్లీలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో తన సొంతూరుకు వచ్చాడు. యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు యువతిని అతడు పలుమార్లు లైంగికంగా వేధించేవాడు. అతడి మాట వినకపోవడంతోనే యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించి నట్టు సమాచారం. హత్యాయత్నం, పోస్కో యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News