హైదరాబాద్లోని నేరేడ్మెట్లో విషాదం, సైకిల్పై బయటికి వెళ్లి చెరువులో శవమై తేలిన సుమేధ
ప్రమాదవశాత్తూ నాలాలో పడి.. బండ చెరువులో శవమై కనిపించిన సుమేధా
మృతురాలి కుటుంబీకులకు ఎంఎల్ఎ మైనంపల్లి పరామర్శ
మన తెలంగాణ/ మల్కాజిగిరి/ మౌలాలి : సైకిల్పై ఇంటి నుండి బయటకు వెళ్లిన ఓ బాలిక ప్రమాదవశాత్తూ ఓపెన్ నాలాలో పడి మృతి చెందిన విషాదకర సంఘటన నేరేడ్మెట్ పోలీ స్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ డి.మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం… నేరేడ్మెట్ సంతోషిమాకాలనీ రోడ్డు నెంబర్ -2కు చెందిన అభిజిత్ కపూరియా, సుకన్య కపూరియా కుమార్తె సుమేధా కపూరియా (12)కాకతీయనగర్లోని కైర్అలీ పబ్లిక్ స్కూల్లో 5వ తరగతి చదువుతోంది. ఈ నెల17 సాయంత్రం సుమేధా తన ఇంటి సమీపంలోనే సైకిల్ తొక్కుకుంటూ బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరలేదు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తమ కుమార్తె ఆచూకీ కోసం గాలించారు. దీంతో వారు తమ కుమార్తె అదృశ్యమైందంటే నేరేడ్మెట్ పోలీసులకు ఫి ర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసు లు, కాలనీలోని సీసీ టీవీ కెమెరాలు పరిశీలించారు. ఈ క్రమంలో ఇంటికి సమీపానున్న ఓపెన్ నాలా వద్ద సుమేధా తీసు కు వెళ్లిన సైకిల్ కనిపించింది.
ఇటీవల వర్షాలు బాగా పడుతుండటంతో ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వర్షపు నీటితో ఓపెన్ నాలాలు పొంగి పొర్లుతుండటం తో ప్రమాదవశాత్తూ పెద్ద నాలాలో పడి కొట్టుకొని పోయి ఉండ వచ్చునని, తల్లిదండ్రులు, స్ధానికులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది సహాయంతో పోలీసులు బాలిక ఆచూకీ కోసం నాలాలో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, బాలిక మృతదేహం శుక్రవారం ఉదయం బండ చెరువు వద్ద డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది, పోలీసులు గుర్తించారు. దీంతో సంతోషిమానగర్లో విషాదం అలుముకొంది. తమ ఇంటి వద్ద సైకిల్ తొక్కుకుంటూ అదృశ్యమైన తమ గారాల పట్టి శుక్రవారం శవమే బండ చెరువులో తేలడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. బాలిక మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.