Sunday, May 5, 2024

కోవిడ్ సంరక్షణ కేంద్రంలో అగ్ని ప్రమాదం: 16 మంది సజీవదహనం

- Advertisement -
- Advertisement -

14 Members dead in Covid care center

అహ్మదాబాద్: కోవిడ్ సంరక్షణ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 16 మంది దుర్మరణం చెందారు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం భరూచ్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. శనివారం తెల్లవారుజామున కోవిడ్ సంరక్షణ కేంద్రంలో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో 16 మంది కరోనా రోగులు సజీవదహనమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. గాయపడిన కోవిడ్ రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. అహ్మదాబాద్ కు 190 కిలో మీటర్ల దూరంలో భరూచ్-జంబూసార్ జాతీయ రహదారిపై కోవిడ్ సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News