- Advertisement -
వాషింగ్టన్: హెచ్ 1బి ఉద్యోగుల శిక్షణ కోసం 15 కోట్ల డాలర్ల( రూ.1100కోట్లు)ను ఖర్చు చేయనున్నట్టు అమెరికా కార్మికశాఖ ప్రకటించింది. కీలక రంగాలైన ఐటి, సైబర్ సెక్యూరిటీ, ఆధునిక తయారీ, రవాణాలాంటి పరిశ్రమల్లో మధ్యస్థాయి, ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో చేరేందుకు వీలుగా శిక్షణ ఇవ్వడం కోసం ఈ నిధుల్ని ఖర్చు చేయనున్నట్టు కార్మికశాఖ తెలిపింది. ఇందుకు ఆయా రంగాల్లోని ప్రైవేట్ సంస్థలతో కలిసి పని చేయనున్నట్టు తెలిపింది. ఆర్థిక వ్యవస్థకు సవాల్గా మారిన కరోనా సృష్టించిన అవాంతరాలను ఎదుర్కొంటూ ఆయా రంగాల్లో అభివృద్ధి లక్షంగా శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపింది. దాంతో, ఉద్యోగావకాశాలు మెరుగుపడనున్నట్టు పేర్కొన్నది.
- Advertisement -