Sunday, April 28, 2024

అమెరికాలో ట్రక్కును ఢీకొన్న ఎస్‌యువి.. 15మంది మృతి

- Advertisement -
- Advertisement -

అమెరికాలో ట్రక్కును ఢీకొన్న ఎస్‌యువి
15 మంది మృతి..పలువురికి గాయాలు

ఎల్ సెంట్రో(అమెరికా): దక్షిణ క్యాలిఫోర్నియా హైవేపైన 27 మంది ప్రయాణికులతో వెళుతున్న ఒక ఎస్‌యువి ఎదురుగా వస్తున్న సెమీ ట్రక్కును ఢీకొనడంతో 15 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. అమెరికా-మెక్సికో సరిహద్దుకు సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. 14 మంది ప్రమాదస్థలిలో మరణించగా మరో వ్యక్తి ఆసుపత్రికి చేరుకున్న వెంటనే మరణించాడు. మట్టి లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ట్రెయిలర్‌ను ఎస్‌యువి ఢీకొన్నట్లు వైద్యులు తెలిపారు. ఎస్‌యువిలో ఇంత మంది ప్రయాణించడం అసాధారణమని, వారంతా వ్యవసాయ కార్మికులు కావచ్చని కస్టమ్స్, బార్డర్ ప్రొటెక్షన్ ప్రతినిధి మకారియో మోరా తెలిపారు.

15 died SUV Crash with Truck in US

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News