- Advertisement -
కైరో : యెమెన్లో శనివారం హౌతీ తిరుగుబాటుదారుల క్షిపణి దాడిలో ఐదేళ్ల బాలికతో సహా 17 మంది దుర్మరణం చెందారు. మారిబ్ లోని రావ్దా పరిసరాల్లో గ్యాస్ స్టేషన్ను లక్షంగా చేసుకుని ఈ దాడి జరిగిందని ప్రావిన్షియల్ గవర్నర్ ప్రెస్ సెక్రటరీ అలీ ఆల్ గులీస్ వెల్లడించారు. ఈ దాడిలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి జరిగిన కొద్ది సేపటికి తిరుగుబాటు దారులు పేలుడు పదార్ధాలతో ఉన్న డ్రోనును కూడా పేల్చి వేశారని ఒక వార్తా సంస్థ తెలియచేసింది. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలిస్తుండగా ఆ రెండు అంబులెన్సులను డ్రోన్ ధ్వంసం చేసిందని పేర్కొంది. అయితే ఈ దాడికి సంబంధించి హౌతీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
17 killed after bomb attack in Yemen
- Advertisement -