Thursday, May 9, 2024

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

18795 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు భారీగా తగ్గాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,795 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య‌శాఖ తాజాగా వెల్లడించింది. ఇక, కరోనాతో 179 మంది మృతి చెందారని తెలిపింది. దీంతో ఇప్పటివరకు దేశంలో వైర‌స్ బారిన ప‌డి 4,47,373 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కొత్త‌గా కరోనా నుంచి 26,030మంది బాధితులు కోలుకోగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 32.9కోట్లకు పైగా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 2,29,902 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 87 కోట్లకు పైగా  టీకాలు పంపిణీ చేసినట్లు ఆరోగ్య‌శాఖ పేర్కొంది.

18795 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News