Monday, April 29, 2024

నార్సింగిలో కారు బీభత్సం: దంపతులు మృతి

- Advertisement -
- Advertisement -

2 Killed in Road Accident in Narsingi

హైదరాబాద్: నగరంలోని నార్సింగిలో కారు బీభత్సం సృష్టించింది. సోమవారం మధ్యాహ్నం నార్సింగిలోని ఎంజిఐటి వద్ద ఓ కారు ద్వాచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో TS07EZ6395 నెంబర్ గల బైక్ పై వెళ్తున్న దంపతులు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంజీవ్ అనే వ్యక్తి మద్యం మత్తులో కారు నడపడంతో ఈ ప్రమాదం జరిందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. కాగా, ఈరోజు తెల్లవారుజామున బంజారాహిల్స్ లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కూడా మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడమే కారణం.

2 Killed in Road Accident in Narsingi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News