Monday, April 29, 2024

దేశంలో కొత్తగా 26,964 పాజిటివ్‌ కేసులు..

- Advertisement -
- Advertisement -

26964 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 26,964 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో 383 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 3,35,31,498కి పెరిగింది. ఇక, దేశంలో ఇప్పటివరకు 4,45,768 మంది బాధితులు కరోనాతో మరణించారు. గత 24గంటల్లో 34,167మంది కోలుకోగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా నుంచి 3,27,83,741మంది బాధితుల కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,01,989 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 82.65 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ పేర్కొంది.

26964 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News