- Advertisement -
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 64,354 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 538 పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,73,995కి చేరింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారినుంచి 8,61,711 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా… కరోనాతో 7,047 మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 95, కృష్ణాలో 86, పశ్చిమ గోదావరిలో 72, కేసులు బయటపడినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
- Advertisement -