Monday, April 29, 2024

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్..

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన ఓ వ్యాన్‌ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ లో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున సేలం జిల్లాలోని సంకరి ప్రాంతంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News