- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో మరో ఆరు కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 1009కి పెరిగిందని తెలిపారు. ఈరోజు 42మంది కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు.ఇప్పటివరకు రాష్ట్రంలో 374 మంది కోలుకున్నారన్నారు. ప్రస్తుతం 610 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.రాష్ట్రంలో కరోనా బారిన పడి ఇప్పటివరకు మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. 50 శాతం కరోనా కేసులు జిహెచ్ఎంసి పరిధిలోనే నమోదవుతున్నట్లు ఆయన తెలిపారు.
6 New Corona Cases Registered in Telangana
- Advertisement -