- Advertisement -
రంగారెడ్డి:శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న 71.47గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. గురువారం ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీ నిర్వహించారు. ఈ సమయంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి మొత్తం 12 చిన్న చిన్న ముక్కలను చేసి జీన్స్ పాయింట్ జీప్ భాగంలో దాచిన 71.47 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో దీని విలువ రూ.3 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం నిందితుడిని గుర్తించి శంషాబాద్ పోలీసులకు అప్పగించారు.
71 grams Gold Seized at Shamshabad Airport
- Advertisement -