Monday, April 29, 2024

కొత్తగా మరో 767 మందికి కొవిడ్

- Advertisement -
- Advertisement -

767 new covid-19 cases reported in telangana

జిహెచ్‌ఎంసి పరిధిలో 77, జిల్లాల్లో 690పాజిటివ్‌లు
6,33,146కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
నిమ్స్‌లో ఇల్లందు ఎంఎల్‌ఎ హరిప్రియకు చికిత్స

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 767 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 77 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 4, భద్రాద్రి 34, జగిత్యాల 17, జనగామ 7, భూపాలపల్లి 14, గద్వాల 1, కరీంనగర్ 51 ,ఖమ్మం 84, ఆసిఫాబాద్ 3, మహబూబ్‌నగర్ 6, మహబూబాబాద్ 20, మంచిర్యాల 65, మెదక్ 3, మేడ్చల్ మల్కాజ్‌గిరి 26, ములుగు 18, నాగర్‌కర్నూల్ 6, నల్గొండ 52, నిర్మల్ 3, నిజామాబాద్ 5, పెద్దపల్లి 59, సిరిసిల్లా 17, రంగారెడ్డి 42, సంగారెడ్డి 9 , సిద్ధిపేట 19, సూర్యాపేట్ 29,వికారాబాద్ 3, వనపర్తి 4, వరంగల్ రూరల్ 17, వరంగల్ అర్బన్ 49, యాదాద్రిలో మరో 17 మందికి వైరస్ సోకింది. అంతేగాక వైరస్ దాడిలో మరో ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 6,33,146కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 6,19,344కి చేరింది.

ఆసుపత్రిలో హరిప్రియ నాయక్…

ఇల్లందు ఎంఎల్‌ఎ హరిప్రియ నాయక్ కరోనాతో నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. మధ్యస్థ లక్షణాలతో పాజిటివ్ తేలినప్పటికీ బలహీనత ఎక్కువగా ఉండటం వలన ఆమె హాస్పిటల్‌లో చేరినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News