Monday, April 29, 2024

కల్తీ మద్యం తాగి 9మంది మృతి..

- Advertisement -
- Advertisement -

గోపాల్‌గంజ్‌: బిహార్ రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గోపాల్‌గంజ్‌ జిల్లాలో కల్తీ మద్యం తాగి 9మంది మృతిచెందారు. మరో ఏడుగురు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. గోపాల్‌గంజ్‌లోని ఓ వ్య‌క్తి ఇంట్లో బుధ‌వారం 16మంది కలిసి క‌ల్తీ మ‌ద్యం తాగారు. దీంతో ఒక‌రి త‌ర్వాత ఒక‌రు నలుగురు వ్య‌క్తులు చ‌నిపోయారు. మిగతా వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వీరిలో మరో ఐదుగురి పరిస్థితి విషమించి ఈరోజు చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

9 Killed after consuming spurious liquor in Bihar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News