- Advertisement -
బొగోటా: బ్రెజిల్ లోని సోపాలో రాష్ట్రంలో గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాగాయి సిటీలో బస్సు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో 41 మంది ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. టెక్స్ టైల్ కంపెనీ తన ఉద్యోగులను విధుల నిమిత్తం కంపెనీకి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం సోపాలో రాష్ట్రానికి పడమర వైపున 340 కిలో మీటర్ల దూరంలో జరిగింది. సోపాలో గవర్నర్ జోయో డోరియా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బాధితులకు సహాయం చేస్తామని వెల్లడించారు.
- Advertisement -